దేవినేని అవినాష్ ఇంటికి సీఎం జగన్
- August 18, 2023
విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ఆయన ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు. సీఎం జగన్.. అవినాష్ ఇంటికి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తమ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను దేవినేని అవినాష్ తన ఇంటికి ఆహ్వానించారు. అవినాష్ ఆహ్వానం మేరకు సీఎం జగన్.. ఆయన ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తన ఇంటికి విచ్చేసిన జగన్ కు అవినాష్ సాదర స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తమ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అరగంట పాటు అవినాష్ నివాసంలో గడిపిన తర్వాత సీఎం జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లికి తిరిగి వెళ్లారు.
కాగా, హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, జోగి రమేశ్, తానేటి వనితతో పాటు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. హయత్ ప్లేస్ చైర్మన్ ఆర్ వీరాస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ సిహెచ్ రామకృష్ణ తదితరులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ









