ఖైరతాబాద్ గణేష్.. థీమ్ను వెల్లడించిన ఉత్సవ కమిటీ
- August 18, 2023
హైదరాబాద్: 63 అడుగుల భారీ మట్టి గణేష్ విగ్రహంతో పాటు మరో రెండు మట్టి విగ్రహాలతో కూడిన పోస్టర్ను సభ్యులు ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రధాన గణేష్ విగ్రహానికి కుడి వైపున 'శ్రీ వీరభద్ర స్వామి' విగ్రహం ఉంచగా, ఎడమ వైపున 'శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి' ఉంచారు. ప్రత్యేకంగా రూపొందించిన ట్రాలీ మూడు విగ్రహాలను నిమజ్జనం రోజున హుస్సేన్సాగర్కు పెద్ద ఊరేగింపుగా తీసుకువెళుతుంది. ఖైరతాబాద్ గణేష్ ఎకో ఫ్రెండ్లీగా ఉండేందుకు పండుగను ఘనంగా జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. ముంబై, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 150 మంది అంకితభావంతో పనిచేస్తున్న కార్మికులు జూన్ నుండి అవిశ్రాంతంగా కృషి చేసి, పండుగ ప్రారంభ తేదీకి నాలుగు రోజుల ముందు సెప్టెంబర్ 15 నాటికి విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. 18న పండుగ కావడంతో గణేశుడు పూజలందుకుంటాడు. 1954లో ఒక్క అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడు ప్రతి ఏడాదీ తన సైజును పెంచుకుంటూ ఈ సంవత్సరం 63 అడుగులకు చేరుకున్నాడు. ఈ భారీ గణేశుడిని సందర్శించడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. నవరాత్రులు పూజలందుకున్న గణేశుడిని భారీగా తరలి వచ్చిన భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనం చేస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







