వదిలేసిన కార్ల పై 3,000 దిర్హామ్ల జరిమానా
- August 19, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ దఫ్రా రీజియన్లోని అధికారులు వదిలివేసిన కార్లపై కఠిన చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీకి చెందిన బృందాలు అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాయి. పార్కింగ్ స్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పాడుబడిన కార్లను క్లియర్ చేయడానికి తనిఖీలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేస్తున్నారు. నిర్లక్ష్యంగా కార్లను వదిలేయడం అనేది 3,000 దిర్హామ్ జరిమానా, వాహన జప్తు చేసే శిక్షార్హమైన నేరంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. అవగాహన పెంపొందించడంతో పాటు, అల్ ధాఫ్రా ప్రచారం ప్రజారోగ్యాన్ని కాపాడటం, స్థలాలను శుభ్రంగా ఉంచడం, స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను నిర్ధారించడం లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. నివాసితులు తమ కార్ల పరిశుభ్రతను ఎల్లప్పుడూ నిర్వహించాలని, ఎక్కువ కాలం వాటిని ఆరుబయట వదిలేయకుండా తగిన నిర్వాహణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







