వదిలేసిన కార్ల పై 3,000 దిర్హామ్ల జరిమానా
- August 19, 2023
యూఏఈ: అబుధాబిలోని అల్ దఫ్రా రీజియన్లోని అధికారులు వదిలివేసిన కార్లపై కఠిన చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీకి చెందిన బృందాలు అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాయి. పార్కింగ్ స్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పాడుబడిన కార్లను క్లియర్ చేయడానికి తనిఖీలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను అధికారులు తెలియజేస్తున్నారు. నిర్లక్ష్యంగా కార్లను వదిలేయడం అనేది 3,000 దిర్హామ్ జరిమానా, వాహన జప్తు చేసే శిక్షార్హమైన నేరంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. అవగాహన పెంపొందించడంతో పాటు, అల్ ధాఫ్రా ప్రచారం ప్రజారోగ్యాన్ని కాపాడటం, స్థలాలను శుభ్రంగా ఉంచడం, స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను నిర్ధారించడం లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. నివాసితులు తమ కార్ల పరిశుభ్రతను ఎల్లప్పుడూ నిర్వహించాలని, ఎక్కువ కాలం వాటిని ఆరుబయట వదిలేయకుండా తగిన నిర్వాహణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







