కీలక ఒప్పందం పై సంతకాలు చేసిన సౌదీ-ఇండియా మంత్రులు
- August 20, 2023
రియాద్: డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ తయారీ, ఇన్నోవేషన్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారతదేశంతో ఒక ఒప్పందంపై సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MCIT) సంతకం చేసింది. ఈ ఒప్పందంపై MCIT మంత్రి అబ్దుల్లా అల్-సవాహా, భారత రైల్వేలు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లు సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇ-ఆరోగ్యం మరియు ఇ-లెర్నింగ్ రంగాలలో పరిశోధన, డిజిటల్ ఆవిష్కరణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇది సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మెరుగుపరుస్తుందని సౌదీ మంత్రి అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు ఆవిష్కరణలకు సంబంధించిన దేశ లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని, ఇది కింగ్డమ్ విజన్ 2030ని సాధించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







