కీలక ఒప్పందం పై సంతకాలు చేసిన సౌదీ-ఇండియా మంత్రులు
- August 20, 2023
రియాద్: డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ తయారీ, ఇన్నోవేషన్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారతదేశంతో ఒక ఒప్పందంపై సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MCIT) సంతకం చేసింది. ఈ ఒప్పందంపై MCIT మంత్రి అబ్దుల్లా అల్-సవాహా, భారత రైల్వేలు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లు సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇ-ఆరోగ్యం మరియు ఇ-లెర్నింగ్ రంగాలలో పరిశోధన, డిజిటల్ ఆవిష్కరణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇది సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మెరుగుపరుస్తుందని సౌదీ మంత్రి అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు ఆవిష్కరణలకు సంబంధించిన దేశ లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని, ఇది కింగ్డమ్ విజన్ 2030ని సాధించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







