ఐసీసీ ప్రపంచ కప్ మస్కట్లు విడుదల
- August 20, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో వన్డే ప్రపంచకప్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఈసారి ప్రపంచకప్ ఎవరిదనే చర్చే జరుగుతోంది. ఈసారి వన్డే ప్రపంచ కప్ ను ఒడిసిపట్టాలన్న సంకల్పంతో అన్ని జట్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు నెలన్నర రోజులే సమయం ఉండడంతో అన్ని జట్లు తుది జట్లను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ(ICC)ప్రపంచ కప్ మస్కట్ లను విడుదల చేసింది. క్రికెట్లో పురుషులు, మహిళలు సమానమే అనే ఉద్దేశంతో ICC ఈ మస్కట్లను తెచ్చింది. గురుగ్రామ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అండర్ -19 వరల్డ్ కప్ విజేతలు యశ్ ధూల్, షఫాలీ వర్మ సమక్షంలో వీటిని ఆవిష్కరించారు. పురుషుల మస్కట్ నీలి రంగుల , మహిళల మస్కట్ ఎరపు రంగులో ఉన్నాయి. వరల్డ్ కప్ పోటీల ముందు మస్కట్లను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సీసీ ఈవెంట్స్ అధ్యక్షుడు క్రిస్ టెట్లీ వెల్లడించాడు. మహిళల మస్కట్ ద్వారా ఈ లోకంలోని సమానత్వం, వైవిధ్యాన్ని చాటుతున్నామని తెలిపారు. తర్వాతి తరం అభిమానులకు చేరువయ్యేందుకు ఈ మస్కట్లు ఎంతో ఉపయోగపడతాయని టెట్లీ తెలిపారు. క్రికెట్ మీదున్న ప్రేమను ప్రపంచానికి చూపేందుకు ఈ రెండు మస్కట్లు దోహదపడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







