ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- August 20, 2023
న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని BAPS స్వామినారాయణ్ సంస్థకు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ కలిసారు. ఈ సందర్భంగా మోదీకి అమెరికాలోని రాబిన్స్విల్లేలోని స్వామినారాయణ అక్షరధామ్లో ప్రస్తుతం కొనసాగుతున్న 'ఫెస్టివల్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్' అప్డేట్తో పాటు BAPS జరుపుకోబోయే 'ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ' వివరాలను స్వామి బ్రహ్మవిహారిదాస్ పీఎం మోదీకి తెలియజేశారు. 2024 ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న అబుధాబిలోని హిందూ మందిర్ ప్రపంచ ప్రయోజనాల కోసం చేస్తున్న సార్వత్రిక సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కృషిని ప్రధాన మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా స్వామీజీకి శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రేమ, శాంతి మరియు సామరస్యానికి ప్రతీగా నిలచే ఐకానిక్ మందిర్ 3D నమూనాను ప్రధానికి బహుకరించారు .
తాజా వార్తలు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు







