ట్రాఫిక్ ఫైన్ కట్టని 8 మంది ప్రవాసుల ప్రయాణంపై ఆంక్షలు..!

- August 21, 2023 , by Maagulf
ట్రాఫిక్ ఫైన్ కట్టని 8 మంది ప్రవాసుల ప్రయాణంపై ఆంక్షలు..!

కువైట్: కువైట్ విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ జరిమానా తప్పనిసరిగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమలు చేసిన మొదటి రోజున 35,000 దినార్లు ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేశారు. కొత్త నిబంధన ఆగస్టు 19వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.  మొదటి రోజు 8 మంది ప్రవాసులను అడ్డుకున్నారు. వారు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా పోర్ట్‌లో జరిమానా చెల్లించలేకపోవడంతో వారి ప్రయాణాన్ని అధికులు అడ్డుకున్నారు. దీంతో వారి ప్రయాణంలో జాప్యం ఎదుర్కొన్నారు. కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఆగస్ట్ 19 నుండి ప్రవాసులకు దేశం విడిచి వెళ్లడానికి ట్రాఫిక్ ఉల్లంఘనలను చెల్లించడం తప్పనిసరి అయింది. అందువల్ల సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద ప్రయాణ జాప్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ వారు బయలుదేరే ముందు ట్రాఫిక్ ఉల్లంఘనలను చెక్ చేసుకొని చెల్లించాలని అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com