ట్రాఫిక్ ఫైన్ కట్టని 8 మంది ప్రవాసుల ప్రయాణంపై ఆంక్షలు..!
- August 21, 2023
కువైట్: కువైట్ విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ జరిమానా తప్పనిసరిగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమలు చేసిన మొదటి రోజున 35,000 దినార్లు ట్రాఫిక్ జరిమానాలను వసూలు చేశారు. కొత్త నిబంధన ఆగస్టు 19వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. మొదటి రోజు 8 మంది ప్రవాసులను అడ్డుకున్నారు. వారు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా పోర్ట్లో జరిమానా చెల్లించలేకపోవడంతో వారి ప్రయాణాన్ని అధికులు అడ్డుకున్నారు. దీంతో వారి ప్రయాణంలో జాప్యం ఎదుర్కొన్నారు. కొందరు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఆగస్ట్ 19 నుండి ప్రవాసులకు దేశం విడిచి వెళ్లడానికి ట్రాఫిక్ ఉల్లంఘనలను చెల్లించడం తప్పనిసరి అయింది. అందువల్ల సరిహద్దు క్రాసింగ్ల వద్ద ప్రయాణ జాప్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ వారు బయలుదేరే ముందు ట్రాఫిక్ ఉల్లంఘనలను చెక్ చేసుకొని చెల్లించాలని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







