బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
- August 21, 2023
హైదరాబాద్: తెలంగాణ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ 115 నియోజకవర్గాలకు బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బిఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్లో పెట్టినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లను మార్చినట్లు చెప్పారు. ఇక కెసిఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ చేయనున్నారు.
2023 ఎన్నికలకు ప్రకటించే అభ్యర్థుల్లో ఆరేడుగురు మాత్రమే సిట్టింగ్లను తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు అంటే ఇతర పార్టీలకు రాజకీయమని విమర్శించారు. గుజరాత్, మహారాష్ట్రలను తలదన్ని తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తోంది దేశంలోనే తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కర్ణాటకలో తెలిసిపోయిందన్నారు.
తెలంగాణలో మజ్లిస్ పార్టీ, బిఆర్ఎస్ కలిసి ముందుకు సాగుతోందన్నారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్లో 29 సీట్లకు ఇరవై తొమ్మిది తామే గెలుస్తామన్నారు. బిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచినట్లు చెప్పారు.
అభ్యర్థుల పూర్తి జాబితా..




తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









