బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది

- May 18, 2016 , by Maagulf
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. 24 గంటల్లో బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు విశాఖ ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com