షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినకూడదా.?

- August 24, 2023 , by Maagulf
షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినకూడదా.?

సీజనల్‌గా వచ్చే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలం మొదలవుతుండగా వచ్చే సీతా ఫలం తినడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని డైటీషియన్లు చెబుతున్నారు.

సీతాఫలం తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, బి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుంటాయ్.

ఉదయం పూట ఈ పండు తినడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల వాతాల వంటి సమస్యలు తొలిగిపోతాయ్. అలాగే, శీతాకాలంలో ఈ పండు లభించడం వల్ల ఈ పండు తినేవారిలో చెడు కొలెస్ర్టాల్ తొలిగిపోతుంది. అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కణాలు కరిగిపోతాయి. 

గర్భిణి స్తీలు ఈ పండు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు మెదడు చురుగ్గా పని చేస్తుంది. అల్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులు తొలిగిపోతాయ్. 

అలాగే క్యాన్సర్‌ని దూరం చేసే శక్తి ఈ పండుకు వుంది. సీతా ఫలం.. పండు మాత్రమే కాదు, ఈ చెట్టు ఆకులూ, బెరడు కూడా ఔషధమే. పలు రకాల మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. 

అయితే, షుగర్ వ్యాధి గ్రస్థులు ఈ పండును ఎక్కువగా తీసుకోరాదని చెబుతుంటారు. అయితే అది నిజమే అని కొన్ని సర్వేల్లో తేలింది. వైద్యుని సలహాతో పరిమితంగా మాత్రమే ఈ పండు తీసుకోవచ్చని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com