షుగర్ పేషెంట్స్ సీతా ఫలం తినకూడదా.?
- August 24, 2023
సీజనల్గా వచ్చే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలం మొదలవుతుండగా వచ్చే సీతా ఫలం తినడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని డైటీషియన్లు చెబుతున్నారు.
సీతాఫలం తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, బి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా వుంటాయ్.
ఉదయం పూట ఈ పండు తినడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల వాతాల వంటి సమస్యలు తొలిగిపోతాయ్. అలాగే, శీతాకాలంలో ఈ పండు లభించడం వల్ల ఈ పండు తినేవారిలో చెడు కొలెస్ర్టాల్ తొలిగిపోతుంది. అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కణాలు కరిగిపోతాయి.
గర్భిణి స్తీలు ఈ పండు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు మెదడు చురుగ్గా పని చేస్తుంది. అల్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులు తొలిగిపోతాయ్.
అలాగే క్యాన్సర్ని దూరం చేసే శక్తి ఈ పండుకు వుంది. సీతా ఫలం.. పండు మాత్రమే కాదు, ఈ చెట్టు ఆకులూ, బెరడు కూడా ఔషధమే. పలు రకాల మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.
అయితే, షుగర్ వ్యాధి గ్రస్థులు ఈ పండును ఎక్కువగా తీసుకోరాదని చెబుతుంటారు. అయితే అది నిజమే అని కొన్ని సర్వేల్లో తేలింది. వైద్యుని సలహాతో పరిమితంగా మాత్రమే ఈ పండు తీసుకోవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







