బ్యాక్-టు-స్కూల్ క్యాంపెయిన్ ప్రారంభం
- August 25, 2023
దోహా: Mowasalat (కర్వా) సహకారంతో 'మై స్కూల్ ఈజ్ మై సెకండ్ హోమ్' అనే థీమ్తో బ్యాక్-టు-స్కూల్ క్యాంపెయిన్ ను ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MoEHE) గురువారం ప్రారంభించింది. మాల్ ఆఫ్ ఖతార్లో ఆగస్టు 24 నుండి 29 వరకు ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. శుక్రవారం మరియు శనివారం (సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు), ఆదివారం, సోమవారం మరియు బుధవారం (మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 వరకు) పాఠశాలల్లో నేర్చుకునే వాతావరణం కోసం విద్యార్థులను సిద్ధం చేసే కార్యక్రమాలు, వివిధ వినోద కార్యక్రమాలను చేపట్టనున్నారు. MOEHE యొక్క పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మర్యం అబ్దుల్లా అల్ మొహన్నాడి మాట్లాడుతూ.. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులను, ముఖ్యంగా ప్రాథమిక మరియు బాల్య దశల్లో ఉన్నవారిని, వివిధ రకాల విద్యల ద్వారా సిద్ధం చేయడమే ఈ ప్రచారం లక్ష్యమన్నారు. కార్వా అకాడమీ డైరెక్టర్, ఫైసల్ అల్ నుయిమి మాట్లాడుతూ.. ప్రతి కొత్త విద్యా సంవత్సరానికి ముందు ఇలాంటి క్యాంపెయిన్ ను నిర్వహిస్తామని, విద్యార్థులతో నడుచుకునే విధానాలపై పాఠశాల బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతిరోజూ వేలాది పాఠశాల బస్సులు దాదాపు 60 వేల మంది విద్యార్థులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తాయని అల్ నుయిమి తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









