ట్రాఫిక్ జరిమానాలపై 35% తగ్గింపు కావాలా?
- August 27, 2023
యూఏఈ: చాలా మంది యూఏఈ వాహనదారులు వారి పేరు మీద ట్రాఫిక్ జరిమానాలు లేదా బ్లాక్ పాయింట్లు లేదా రెండూ కలిగి ఉంటారు. కానీ ట్రాఫిక్ జరిమానాలపై డిస్కౌంట్, బ్లాక్ పాయింట్లను తగ్గించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అబుధాబి పోలీసులతో సహా యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ట్రాఫిక్ నేరాలకు పాల్పడిన వాహనదారులు, వారి జరిమానాలపై డిస్కౌంట్లను పొందడంతోపాటు వారి రికార్డుల నుండి బ్లాక్ పాయింట్లను తొలగించే మార్గాలను వెల్లడించింది.
ట్రాఫిక్ జరిమానా చెల్లింపు ప్లాన్ ద్వారా 35 శాతం తగ్గింపును పొందవచ్చని అబుధాబి పోలీసులు శనివారం వాహనదారులకు గుర్తు చేశారు. గత ఏడాది అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. షార్జాలో జరిమానాల ముందస్తు చెల్లింపుపై డిస్కౌంట్లను అందించే పథకం అమలులో ఉంది. వాహనదారులు ట్రాఫిక్ జరిమానాలను నేరం చేసిన రెండు నెలలలోపు (60 రోజులు) చెల్లిస్తే 35 శాతం తగ్గింపు, సంవత్సరంలో 25 శాతం తగ్గింపు అందించబడుతుంది. అయితే, ఈ తగ్గింపు తీవ్రమైన ఉల్లంఘనలకు వర్తించదు. జరిమానాలను 12 నెలల కాలానికి సున్నా-వడ్డీ రేటుతో బ్యాంకుల ద్వారా వాయిదాలలో చెల్లించవచ్చని అథారిటీ తెలిపింది.
చెల్లింపు ఛానెల్లు...
అబుధాబి ప్రభుత్వం "Tamm" డిజిటల్ ఛానెల్లు, పోలీసుల కస్టమర్ సర్వీస్ మరియు హ్యాపీనెస్ ప్లాట్ఫారమ్ల ద్వారా మరియు యూఏఈలోని ఐదు బ్యాంకుల సహకారంతో బ్యాంకుల మొబైల్ అప్లికేషన్ల ద్వారా నేరుగా చెల్లింపులతో సహా ట్రాఫిక్ ఉల్లంఘనలను చెల్లించడానికి అథారిటీ అనేక ఛానెల్లను ప్రవేశపెట్టింది. వీటిలో అబుధాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB), అబుధాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB), ఫస్ట్ అబుధాబి బ్యాంక్ (FAB), మష్రెక్ అల్ ఇస్లామి మరియు ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ సేవను పొందేందుకు, డ్రైవర్లు తప్పనిసరిగా ఈ బ్యాంకుల్లో ఒకదాని ద్వారా జారీ చేసిన క్రెడిట్ కార్డ్లను కలిగి ఉండాలి. వాహనదారులు ట్రాఫిక్ జరిమానాలను వాయిదాలలో చెల్లించడానికి అభ్యర్థించడానికి బుక్ చేసిన తేదీ నుండి రెండు వారాలకు మించని వ్యవధిలో నేరుగా బ్యాంకును సంప్రదించాలి.
బ్లాక్ పాయింట్ల తగ్గింపు...
మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్పై ప్రతికూల ట్రాఫిక్ పాయింట్లను కలిగి ఉన్నట్లయితే, కొన్నింటిని కొట్టేసే అవకాశం ఇక్కడ ఉంది. యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు సురక్షితంగా డ్రైవింగ్ చేసే వారు వారి రికార్డు నుండి నాలుగు ట్రాఫిక్ పాయింట్లను తగ్గించుకోవచ్చని ప్రకటించింది. ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ ప్రకారం.. ఈ చర్య MoI ప్రమాద రహిత రోజు చొరవలో భాగంగా ఆగస్టు 28న ప్రవేశపెట్టనున్నారు. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలపై వాహనదారులపై విధించే శిక్షాస్మృతి ప్రతికూల పాయింట్లు 24 నెగిటివ్ పాయింట్లు వచ్చిన తర్వాత డ్రైవర్ల లైసెన్స్లు సస్పెండ్ చేస్తారు.
ఎలా పొందాలి...
పాఠశాలకు వెళ్లే మొదటి రోజున సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు వాహనదారులు ముందుగా MoI వెబ్సైట్లో ప్రతిజ్ఞ ను పూర్తిచేయాలి. ఆ తర్వాత ఆగస్టు 27న ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా, ప్రమాదాలకు పాల్పడకూడదు.
తాజా వార్తలు
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!







