ఇస్రో మరో కీలక ప్రయోగం..
- August 27, 2023
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జాబిల్లి దక్షిణ దృవంపై చంద్రయాన్ 3ని విజయంతంగా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. అదే ఉత్సహంతో సూర్యుడి రహస్యాలు కనుగొనేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య – ఎల్1 ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఈ ప్రయోగాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఇస్రో అధికారులు అంటున్నారు.
ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు. పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్
ఆదిత్య – ఎల్ 1ను నింగిలోకి తీసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణంపై పరిశోధనం చేయనున్నారు. కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.
ఆదిత్య – ఎల్ 1 సూర్యున్ని అధ్యయనం చేసేందుకు చేపడుతున్న తొలి మిషన్. 1500 కిలోల బరువు ఉన్న శాటిలైట్ ఇది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యున్ని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. ఆదిత్య – ఎల్1 మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్లనుంది.
ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనా గ్రాఫ్ తోపాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్టో మీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్టో మీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్ లను అమర్చనున్నారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







