కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమైన ఒమన్ స్కూల్స్
- August 28, 2023
మస్కట్: కొత్త విద్యా సంవత్సరం “2023/2024” కోసం పాఠశాలలకు తిరిగి రావడం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. నాన్ టీచింగ్ స్టాఫ్ సుల్తానేట్ పాఠశాలల్లో తమ పనిని ప్రారంభించారు. మంగళవారం విద్యార్థులను స్వాగతించేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సూపర్విజన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సులైమాన్ బిన్ అబ్దుల్లా అల్-జముదీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నూతన ఉత్సాహంతో సిద్ధమయ్యారని, ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ కోసం ప్రత్యేక సంస్థ 2023/2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన శిక్షణ ప్రణాళికలో అమలు చేస్తోందని తెలిపారు. ఒమన్ విజన్ 2040కి అనుగుణంగా విద్యా ప్రక్రియలో నైపుణ్యం లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రణాళికల ప్రకారం గవర్నరేట్ పాఠశాలలు పునర్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఒక్కో పాఠశాలకు మంజూరైన కోటా ప్రకారం పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయిందన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







