‘ఇ-గవర్నమెంట్’ ద్వారా 2.2 మిలియన్ ఆన్లైన్ లావాదేవీలు
- August 29, 2023
బహ్రెయిన్ : నేషనల్ పోర్టల్, ఇ-గవర్నమెంట్ యాప్స్ , సెల్ఫ్-సర్వీస్ కియోస్క్లు వంటి ఎలక్ట్రానిక్ ఛానెల్ల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2,200,000 కంటే ఎక్కువ ఆన్లైన్ లావాదేవీలకు పెరిగాయి. నేషనల్ పోర్టల్కి సందర్శకుల సంఖ్య 13% పెరిగిందని, మొదటి అర్ధ భాగంలో 11 మిలియన్ల మంది సందర్శించి అగ్రస్థానంలో ఉన్నారని, ఈ ఫలితాలు 13% వృద్ధిని చూపించాయని ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జకారియా అల్ఖాజా తెలిపారు. ఇ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఎలక్ట్రానిక్ లావాదేవీల మొత్తం సంఖ్య సుమారు 700,000కి చేరుకుందని, 2022 మొదటి అర్ధభాగంతో పోలిస్తే 15% పెరిగిందని, ఆర్థిక లావాదేవీలు 13% మరియు యాప్ వినియోగంలో 18% పెరిగాయని డాక్టర్ అల్ఖాజా తెలిపారు. టాప్ సర్వీస్ జాబితాలో మొదటి స్థానంలో పవర్,వాటర్ డిపార్టుమెంట్.. ఆ తర్వాత జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, పాస్పోర్ట్ పునరుద్ధరణ సేవలు ఉన్నాయి.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









