తెదేపాకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ

- September 01, 2023 , by Maagulf
తెదేపాకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ

అమరావతి: తెలుగు దేశం పార్టీ సంక్షేమనిధికి గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మూర్తి  రూ.25 లక్షల విరాళం అందించారు.మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విరాళం చెక్కు ద్వారా అందజేశారు.పార్టీ కోసం పాటుపడే రాధాకృష్ణ లాంటి వారి సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు.లోకేష్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరడం పై హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com