టాస్ గెలిచిన టీమిండియా..
- September 02, 2023
ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ వేయగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్సే పడింది. దీంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు. నేపాల్తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ఈ పిచ్పై 2020 నుంచి 9 వన్డే మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలిచింది. కాగా ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 13సార్లు (వన్డే ఫార్మాల్లో) తలపడ్డాయి. భారత్ 7, పాక్ 5 మ్యాచుల్లో గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు.
జట్ల వివరాలు...
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









