టాస్ గెలిచిన టీమిండియా..
- September 02, 2023
ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ వేయగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్సే పడింది. దీంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు. నేపాల్తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ఈ పిచ్పై 2020 నుంచి 9 వన్డే మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలిచింది. కాగా ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 13సార్లు (వన్డే ఫార్మాల్లో) తలపడ్డాయి. భారత్ 7, పాక్ 5 మ్యాచుల్లో గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు.
జట్ల వివరాలు...
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









