తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు

- September 02, 2023 , by Maagulf
తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు

దోహా: వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , తోబుట్టువులను వదిలి, యేళ్ల కు ఏళ్ళు రాఖీ పండుగకి నోచుకోని గల్ఫ్ అన్నల సంతోషం కోసం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా తెలంగాణ జాగృతి ఖతర్ దోహా లో ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు.

ప్రధాన కార్యదర్శి ప్రవీణ లక్ష్మి ముకల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన కార్మిక సోదరులు పాల్గొన్నారు.Indian Community Benevolent Forum- Qatar మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శంకర్ గౌడ్ ప్రముఖ తెలుగు విద్యావేత్త ప్రసాద్ రావు కోడూరు, Indian Cultural Centre, Doha-Qatar అడ్వైసరి కౌన్సిల్ మెంబర్ నందిని ఆబ్బగౌని, Doha Qatar Telangana Gulf Samithi-DQTGS  అధ్యక్షులు మధు మైదం ముఖ్య అతిథిలుగా హాజరు కాగా జాగృతి ఖతర్ అడ్వైసరి కౌన్సిల్ మెంబర్ స్వప్న కేసా , కార్యవర్గ సభ్యులు వేగి పద్మిని ,దుర్గ ప్రసన్న,ఆదర్శ పోతుల,మహాలక్ష్మి కొప్పరపు, రాజేశ్వరి రుద్ర,డా.కవితా పాటిల్,నాగ లక్ష్మి పులి మరియు శ్రావణితదితరులు కార్మిక సోదరులకు రాఖిలను కట్టి మిఠాయిలను తినిపించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com