225% పెరిగిన సౌదీ అరేబియా పర్యాటక మిగులు
- September 02, 2023
రియాద్: పర్యాటక మిగులు Q1 2023లో SR22.8 బిలియన్లకు పెరిగిందని సౌదీ అరేబియా టూరిజం మంత్రిత్వ శాఖ 2023 మొదటి త్రైమాసికం గణాంకాలను వెల్లడించింది. గతసంవత్సరం మొదటి త్రైమాసికంలో SR1.6 బిలియన్లుగా ఉంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) డేటా ప్రకారం.. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 225% పెరుగుదల నమోదైంది. అదే విధంగా SR37 బిలియన్లకు ఇన్కమింగ్ టూరిజం ఆదాయాలు చేరుకున్నాయి. కింగ్డమ్ యొక్క పర్యాటక రంగం వృద్ధిని పెంపొందించడానికి వివిధ ప్రభుత్వ సంస్థలతో నిరంతర సహకారాన్ని పెంపొందించడం ద్వారా సౌదీ అరేబియాను అగ్ర అంతర్జాతీయ గమ్యస్థానాలలో నిలిపాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా పర్యాటక పరిశ్రమలో చెప్పుకోదగ్గ మైలురాళ్లను సాధించింది. అంతర్జాతీయ పర్యాటక ఆదాయ సూచికలో దేశం ఆకట్టుకునే 16 స్థానాలను అధిరోహించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో నిలిచింది. 2019లో 27వ స్థానంలో నిలిచింది. దీంతోపాటు సౌదీ అరేబియా మొదటి త్రైమాసికంలో అంతర్జాతీయంగా సుమారుగా 7.8 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









