యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన కువైట్ ఉప ప్రధాని
- September 02, 2023
అబుధాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను శుక్రవారం కువైట్ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ అహ్మద్ ఫహద్ అల్-అహ్మద్ అల్-సబా కలుసుకున్నారు. కస్ర్ అల్-షాతిలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య లోతైన సోదర సంబంధాలపై చర్చించారు. కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా యొక్క శుభాకాంక్షలను షేక్ అహ్మద్ యూఏఈ నాయకుడికి తెలిజయజేశారు. ఇరు దేశాలు, వారి ప్రజల పురోగతి, శ్రేయస్సు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. అంతకుముందు అబుధాబి అధ్యక్ష విమానాశ్రయానికి చేరుకున్న షేక్ అహ్మద్కు అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







