యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన కువైట్ ఉప ప్రధాని
- September 02, 2023
అబుధాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను శుక్రవారం కువైట్ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ అహ్మద్ ఫహద్ అల్-అహ్మద్ అల్-సబా కలుసుకున్నారు. కస్ర్ అల్-షాతిలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య లోతైన సోదర సంబంధాలపై చర్చించారు. కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా యొక్క శుభాకాంక్షలను షేక్ అహ్మద్ యూఏఈ నాయకుడికి తెలిజయజేశారు. ఇరు దేశాలు, వారి ప్రజల పురోగతి, శ్రేయస్సు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. అంతకుముందు అబుధాబి అధ్యక్ష విమానాశ్రయానికి చేరుకున్న షేక్ అహ్మద్కు అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









