యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన కువైట్ ఉప ప్రధాని
- September 02, 2023
అబుధాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను శుక్రవారం కువైట్ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ అహ్మద్ ఫహద్ అల్-అహ్మద్ అల్-సబా కలుసుకున్నారు. కస్ర్ అల్-షాతిలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య లోతైన సోదర సంబంధాలపై చర్చించారు. కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా యొక్క శుభాకాంక్షలను షేక్ అహ్మద్ యూఏఈ నాయకుడికి తెలిజయజేశారు. ఇరు దేశాలు, వారి ప్రజల పురోగతి, శ్రేయస్సు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. అంతకుముందు అబుధాబి అధ్యక్ష విమానాశ్రయానికి చేరుకున్న షేక్ అహ్మద్కు అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









