సిగ్నల్ జంప్ ప్రమాదాలు. ఇద్దరు మృతి, 73 మందికి గాయాలు
- September 04, 2023
దుబాయ్: సిగ్నల్ జంప్ అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ ఉల్లంఘనలలో ఒకటిగా ఈ ఏడాది నిలిచింది. నేరానికి సంబంధించిన షాకింగ్ గణాంకాలను దుబాయ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు గత ఏడు నెలల్లో 51 ప్రమాదాలను నమోదు చేశారు. వీటిల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 73 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. "ప్రస్తుత సంవత్సరంలో సిగ్నల్ జంప్ కు సంబంధించి 13,875 పైగా ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి. ఉల్లంఘనలపై సుమారు 855 వాహనాలు జప్తు చేయబడ్డాయి" అని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, సిగ్నల్ జంప్ చేస్తే 1,000 దిర్హామ్ జరిమానా, లైసెన్స్పై 12 బ్లాక్ పాయింట్లు మరియు 30 రోజుల వాహన జప్తు విధించబడుతుంది. దీంతోపాటు దుబాయ్లో ఇటీవల అమలు చేయబడిన ఒక చట్టం నేరానికి Dh50,000 జరిమానా, లైసెన్స్పై 23 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించింది.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









