బహ్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
- September 05, 2023
బహ్రెయిన్: ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య సంబంధాలు ఊపందుకుంటున్నాయి. బహ్రెయిన్ మరియు ఇజ్రాయెల్ వాణిజ్య సంబంధాలు, పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి. మరోవైపు బహ్రెయిన్లో కొత్త రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించింది. 2021లో ఏర్పాటు చేసిన దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 15, 2020న బహ్రెయిన్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సూడాన్ మరియు మొరాకోలతో వాషింగ్టన్లో కుదిరిన అబ్రహం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
రెండు దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని అభివృద్ధి చేయడానికి కుదిరిన రెండు అవగాహన ఒప్పందాల (MOUలు)పై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ , ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ సంతకం చేశారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, యువజన వ్యవహారాలలో సహకారం కోసం మంత్రులు రెండు ఉమ్మడి ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మంత్రి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల సంఖ్యను పెంచడంతోపాటు వాణిజ్య పరిమాణం, పెట్టుబడులను పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







