బహ్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
- September 05, 2023
బహ్రెయిన్: ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య సంబంధాలు ఊపందుకుంటున్నాయి. బహ్రెయిన్ మరియు ఇజ్రాయెల్ వాణిజ్య సంబంధాలు, పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి. మరోవైపు బహ్రెయిన్లో కొత్త రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించింది. 2021లో ఏర్పాటు చేసిన దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 15, 2020న బహ్రెయిన్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సూడాన్ మరియు మొరాకోలతో వాషింగ్టన్లో కుదిరిన అబ్రహం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
రెండు దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని అభివృద్ధి చేయడానికి కుదిరిన రెండు అవగాహన ఒప్పందాల (MOUలు)పై బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ , ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ సంతకం చేశారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, యువజన వ్యవహారాలలో సహకారం కోసం మంత్రులు రెండు ఉమ్మడి ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మంత్రి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల సంఖ్యను పెంచడంతోపాటు వాణిజ్య పరిమాణం, పెట్టుబడులను పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







