కువైట్ లో భారతీయ నర్సు మృతి

- September 05, 2023 , by Maagulf
కువైట్ లో భారతీయ నర్సు మృతి

కువైట్: 42 ఏళ్ల భారతీయ మహిళ షీబా అబ్బాసియాలోని భవనంపై నుంచి పడి మృతి చెందింది. పోలీసుల నివేదికల ప్రకారం.. ఆమె అబ్బాసియాలోని అప్సర బజార్ సమీపంలోని భవనం 10 వ అంతస్తులో నివసిస్తున్నారు. ఆమె ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. కేరళలోని చంగనస్సేరీకి చెందిన షీబా కిర్‌బీ కంపెనీలో పనిచేస్తున్న తన భర్త రెజీని విడిచిపెట్టింది. ఆమె పెద్ద కొడుకు ఇంజినీరింగ్ కోసం ఇండియాలో, చిన్న కూతురు అబ్బాసియా యునైటెడ్ ఇండియన్ స్కూల్‌లో చదువుతున్నారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై మరింత దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com