నకిలీ వస్తువులను విక్రయిస్తే.. 1 మిలియన్ దిర్హామ్ వరకు జరిమానా, జైలు

- September 05, 2023 , by Maagulf
నకిలీ వస్తువులను విక్రయిస్తే.. 1 మిలియన్ దిర్హామ్ వరకు జరిమానా, జైలు

యూఏఈ: నకిలీ వస్తువుల కట్టడికి యూఏఈ చర్యలుచేపట్టింది.  యూఏఈ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు,  చట్టాలను అమలు చేస్తుంది. కంపెనీలు మరియు వ్యక్తులపై ప్రభావం చూపే నకిలీ వస్తువుల మార్కెట్ విలువ $2-3 ట్రిలియన్‌లుగా ఉంటుందని అంచనా. యూఏఈలో నకిలీ వస్తువులను అమ్మడం నేరమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక నేరాల విభాగగంలోని సీనియర్ అసోసియేట్ మహమూద్ షకీర్ అల్ మషాదానీ  తెలిపారు.   నికలీ వస్తువును గుర్తించిన పక్షంలో వారికి జరిమానాలు, జైలు శిక్ష విధించడంతోపాటు దేశం నుంచి బహిష్కరిస్తారని అల్ మషాదానీ తెలిపారు. ట్రేడ్‌మార్క్‌లపై ఫెడరల్ డిక్రీ లా నం. 36లోని 2021లోని ఆర్టికల్ 49 ప్రకారం.. జైలుశిక్షతో పాటు Dh1 మిలియన్ల వరకు జరిమానా కొన్ని రెండింటిని విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com