తైఫ్లో పబ్లిక్ బస్సు ట్రాన్స్ పొర్ట్ సేవలు ప్రారంభం
- September 07, 2023
జెడ్డా: తైఫ్ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ నహర్ తైఫ్ గవర్నరేట్లో పబ్లిక్ బస్సు రవాణా సేవల ప్రాజెక్టును ప్రారంభించారు. అల్-సుబైహిలో ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్, తైఫ్ మేయర్ నాసర్ అల్-రెహైలీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సీఈఓ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కీలకమైన బస్ ప్రాజెక్ట్ రాజ్యంలో పబ్లిక్ బస్సు రవాణా ప్రాజెక్టుల మొదటి దశలో కీలకమైనది. ఇది గవర్నరేట్లోని అత్యంత ముఖ్యమైన కేంద్రాలు, ల్యాండ్మార్క్లను అనుసంధానించే తొమ్మిది ప్రధాన ట్రాక్ల ద్వారా సంవత్సరానికి రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు సేవలు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. 182 బస్ స్టాప్ పాయింట్లు ఉంటాయని, ఈ ప్రాజెక్ట్లో 58 బస్సులు రోజుకు 18 గంటలు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇది గవర్నరేట్లోని ట్రాఫిక్ భద్రత స్థాయిని మెరుగుపరచడం, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేయనుందన్నారు. Taif Buses అప్లికేషన్ ద్వారా ప్రయాణికులు సేవలను ముందుగానే బుక్ చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







