చెత్తబుట్టలో రూ.56 లక్షల విలువైన బంగారం..
- September 08, 2023
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బంగారం పట్టుబడుతోంది. ఇతర దేశాలనుండి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చి..ఇక్కడ అధికారులకు చిక్కుతున్నారు. అయితే అధికారుల నుండి తప్పించుకెందుకు చాల తెలివిగా బంగారాన్ని దాచిపెడుతున్నారు..కానీ అధికారుల మూడో కన్ను నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి..ఎయిర్ పోర్ట్ సిబ్బంది తో కలిసి రూ. 56 లక్షల విలువైన బంగారాన్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికాడు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి బుధవారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. తన వెంట రహస్యంగా రూ.56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారం బిస్కెట్లను తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చాడు. అయితే అతడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వచ్చాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా.. అతడి తీరు అనుమానస్పదంగా కనిపించటంతో అధికారులు అతడిని విచారించారు.
దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి చెత్తడబ్బాలో వేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని ఎయిర్పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







