చెత్తబుట్టలో రూ.56 లక్షల విలువైన బంగారం..
- September 08, 2023
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బంగారం పట్టుబడుతోంది. ఇతర దేశాలనుండి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చి..ఇక్కడ అధికారులకు చిక్కుతున్నారు. అయితే అధికారుల నుండి తప్పించుకెందుకు చాల తెలివిగా బంగారాన్ని దాచిపెడుతున్నారు..కానీ అధికారుల మూడో కన్ను నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి..ఎయిర్ పోర్ట్ సిబ్బంది తో కలిసి రూ. 56 లక్షల విలువైన బంగారాన్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికాడు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి బుధవారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. తన వెంట రహస్యంగా రూ.56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారం బిస్కెట్లను తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చాడు. అయితే అతడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వచ్చాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా.. అతడి తీరు అనుమానస్పదంగా కనిపించటంతో అధికారులు అతడిని విచారించారు.
దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి చెత్తడబ్బాలో వేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని ఎయిర్పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









