నిజామాబాద్‌ జిల్లా కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌..

- September 12, 2023 , by Maagulf
నిజామాబాద్‌ జిల్లా కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌..

నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వ హాస్టల్స్ లలో తరుచు ఫుడ్‌ పాయిజన్‌ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్క అధికారులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నప్పటికీ..తరుచు ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కు గురై విద్యార్థినులు హాస్పటల్ పాలయ్యారు.

సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్‌ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్‌ఛార్జ్‌ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com