కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీని సందర్శించిన భారత రాయబారి
- September 13, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా మంగళవారం కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా మరియు సహాయక చర్యల్లో దాని పాత్రను ప్రశంసించారు. అలాగే ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల వల్ల ప్రభావితమైన వారికి నిరంతరం మద్దతునిస్తుందని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా KRCS డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ హిలాల్ అల్ సయెర్తో సమావేశమయ్యారు. తన KRCS పర్యటన సమయంలో ఇరుపక్షాల మధ్య సంబంధాలను పెంచడం, మానవతా రంగంలో సహకారం, సమన్వయంపై చర్చించినట్లు పేర్కొన్నారు. KRCS ప్రధాన కార్యాలయానికి భారత రాయబారి సందర్శనను డాక్టర్ అల్ సయెర్ స్వాగతించారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు మరియు వివాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయిన ప్రజలకు మద్దతును అందించే లక్ష్యంతో KRCS యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







