కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీని సందర్శించిన భారత రాయబారి
- September 13, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా మంగళవారం కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా మరియు సహాయక చర్యల్లో దాని పాత్రను ప్రశంసించారు. అలాగే ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల వల్ల ప్రభావితమైన వారికి నిరంతరం మద్దతునిస్తుందని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా KRCS డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ హిలాల్ అల్ సయెర్తో సమావేశమయ్యారు. తన KRCS పర్యటన సమయంలో ఇరుపక్షాల మధ్య సంబంధాలను పెంచడం, మానవతా రంగంలో సహకారం, సమన్వయంపై చర్చించినట్లు పేర్కొన్నారు. KRCS ప్రధాన కార్యాలయానికి భారత రాయబారి సందర్శనను డాక్టర్ అల్ సయెర్ స్వాగతించారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు మరియు వివాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయిన ప్రజలకు మద్దతును అందించే లక్ష్యంతో KRCS యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







