కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీని సందర్శించిన భారత రాయబారి

- September 13, 2023 , by Maagulf
కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీని సందర్శించిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా మంగళవారం కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా మరియు సహాయక చర్యల్లో దాని పాత్రను ప్రశంసించారు.  అలాగే ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల వల్ల ప్రభావితమైన వారికి నిరంతరం మద్దతునిస్తుందని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా KRCS డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ హిలాల్ అల్ సయెర్‌తో సమావేశమయ్యారు.  తన KRCS పర్యటన సమయంలో ఇరుపక్షాల మధ్య సంబంధాలను పెంచడం, మానవతా రంగంలో సహకారం, సమన్వయంపై చర్చించినట్లు పేర్కొన్నారు. KRCS ప్రధాన కార్యాలయానికి భారత రాయబారి సందర్శనను డాక్టర్ అల్ సయెర్ స్వాగతించారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు మరియు వివాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయిన ప్రజలకు మద్దతును అందించే లక్ష్యంతో KRCS యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com