మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు
- September 14, 2023
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఈడి పేర్కొంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్ కి చెందిన బిజినెస్మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై బుధవారం అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఆయన నుంచి ఈడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడి అభియోగం మోపింది.
ఈ నేపథ్యంలోనే గురువారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఈడి జారీ చేసింది. నిజానికి అరుణ్ అప్రూవర్ గా మారడం ఇది కొత్త కాదు. గతంలో ఓసారి కూడా ఇలాగే అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఇప్పుడు మరోసారి అరుణ్ రామచంద్ర అప్రూవర్ గా మారారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







