ఎటిసలాట్ వినియోగదారులకు ఉచిత కాల్ల ఆఫర్..!!
- September 14, 2023
యూఏఈ: యూఏఈ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎటిసలాట్ తన వినియోగదారులకు ఉచిత కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి లిబియాకు ఉచిత కాల్లను ప్రకటించింది ఎటిసలాట్. భారీ వరదల నేపథ్యంలో ఉత్తర ఆఫ్రికా దేశంలో 5,000 మందికి పైగా చనిపోయారని, 10,000 మందికి పైగా తప్పిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు. ఉచిత కాల్లు వరదల వల్ల ప్రభావితమైన కస్టమర్లు, సహోద్యోగులు, వారి ప్రియమైన వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు సంఘీభావాన్ని తెలియజేస్తూ అందించబడుతున్నాయని అని పేర్కొంది. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) కూడా లిబియాలో వరదల వల్ల నష్టపోయిన వారికి అత్యవసర మానవతా సహాయం అందిస్తోంది. తమ కస్టమర్లు సెప్టెంబర్ 20 బుధవారం వరకు ఒక వారం పాటు కాల్ చేయడానికి 30 ఉచిత అంతర్జాతీయ నిమిషాలను స్వీకరిస్తారని తెలిపింది. లిబియాలో రోమింగ్ నెట్వర్క్లో ఉన్న కస్టమర్లు అపరిమిత అవుట్గోయింగ్ నిమిషాలు, 30 ఇన్కమింగ్ నిమిషాల నుండి ప్రయోజనం పొందుతారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









