ఎటిసలాట్ వినియోగదారులకు ఉచిత కాల్ల ఆఫర్..!!
- September 14, 2023
యూఏఈ: యూఏఈ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎటిసలాట్ తన వినియోగదారులకు ఉచిత కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి లిబియాకు ఉచిత కాల్లను ప్రకటించింది ఎటిసలాట్. భారీ వరదల నేపథ్యంలో ఉత్తర ఆఫ్రికా దేశంలో 5,000 మందికి పైగా చనిపోయారని, 10,000 మందికి పైగా తప్పిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు. ఉచిత కాల్లు వరదల వల్ల ప్రభావితమైన కస్టమర్లు, సహోద్యోగులు, వారి ప్రియమైన వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు సంఘీభావాన్ని తెలియజేస్తూ అందించబడుతున్నాయని అని పేర్కొంది. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) కూడా లిబియాలో వరదల వల్ల నష్టపోయిన వారికి అత్యవసర మానవతా సహాయం అందిస్తోంది. తమ కస్టమర్లు సెప్టెంబర్ 20 బుధవారం వరకు ఒక వారం పాటు కాల్ చేయడానికి 30 ఉచిత అంతర్జాతీయ నిమిషాలను స్వీకరిస్తారని తెలిపింది. లిబియాలో రోమింగ్ నెట్వర్క్లో ఉన్న కస్టమర్లు అపరిమిత అవుట్గోయింగ్ నిమిషాలు, 30 ఇన్కమింగ్ నిమిషాల నుండి ప్రయోజనం పొందుతారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







