సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయం.. ముఠాకు జైలు శిక్ష
- September 16, 2023
యూఏఈ: సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయాలు చేస్తున్న నేరస్థుల ముఠాకు జైలు శిక్ష పడింది. ఫెడరల్ క్యాపిటల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ కరెన్సీ విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు ప్రారంభించింది. అసలు కరెన్సీ విలువపై 50 శాతం వరకు రాయితీ ఇస్తానని నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు వారిని సంప్రదించిన సమయంలో డెలివరీ కోసం ఒక స్థలాన్ని చెబుతారు. నిందితులు నకిలీ కరెన్సీని బాధితులకు అంటగట్టి బదులుగా నిజమైన యూఏఈ దిర్హామ్లను తీసుకుని పారిపోతుంటారు. ముఠా చేతుల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ లైసెన్స్ పొందిన అధికారుల ద్వారా మాత్రమే కరెన్సీలను పొందాలని, వ్యక్తులను నమ్మవద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







