సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయం.. ముఠాకు జైలు శిక్ష
- September 16, 2023
యూఏఈ: సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయాలు చేస్తున్న నేరస్థుల ముఠాకు జైలు శిక్ష పడింది. ఫెడరల్ క్యాపిటల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ కరెన్సీ విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు ప్రారంభించింది. అసలు కరెన్సీ విలువపై 50 శాతం వరకు రాయితీ ఇస్తానని నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు వారిని సంప్రదించిన సమయంలో డెలివరీ కోసం ఒక స్థలాన్ని చెబుతారు. నిందితులు నకిలీ కరెన్సీని బాధితులకు అంటగట్టి బదులుగా నిజమైన యూఏఈ దిర్హామ్లను తీసుకుని పారిపోతుంటారు. ముఠా చేతుల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ లైసెన్స్ పొందిన అధికారుల ద్వారా మాత్రమే కరెన్సీలను పొందాలని, వ్యక్తులను నమ్మవద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







