సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయం.. ముఠాకు జైలు శిక్ష

- September 16, 2023 , by Maagulf
సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయం.. ముఠాకు జైలు శిక్ష

యూఏఈ: సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ విక్రయాలు చేస్తున్న నేరస్థుల ముఠాకు జైలు శిక్ష పడింది. ఫెడరల్ క్యాపిటల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ కరెన్సీ విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు ప్రారంభించింది.  అసలు కరెన్సీ విలువపై 50 శాతం వరకు రాయితీ ఇస్తానని నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు వారిని సంప్రదించిన సమయంలో డెలివరీ కోసం ఒక స్థలాన్ని చెబుతారు. నిందితులు నకిలీ కరెన్సీని బాధితులకు అంటగట్టి బదులుగా నిజమైన యూఏఈ దిర్హామ్‌లను తీసుకుని పారిపోతుంటారు. ముఠా చేతుల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ  పబ్లిక్ ప్రాసిక్యూషన్ లైసెన్స్ పొందిన అధికారుల ద్వారా మాత్రమే కరెన్సీలను పొందాలని, వ్యక్తులను నమ్మవద్దని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com