భారతదేశంలో అల్పపీడనం.. ఒమన్లో ప్రభావం చూపదు..!
- September 16, 2023
మస్కట్: మధ్య భారతదేశంలో వాతావరణ అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాబోయే 5 రోజులలో ఒమన్ సుల్తానేట్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని, అరేబియా సముద్రం మధ్యలో ఇది కదిలే అవకాశాలను నిశితంగా గమనిస్తున్నట్లు ఒమన్ వాతావరణ శాఖ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. “ప్రస్తుతం మధ్య భారతదేశంలో వాతావరణ అల్పపీడనం నెలకొని ఉంది. ఉత్తర భారతదేశంలోని తూర్పు అరేబియా సముద్రం వైపు నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతోంది. అరేబియా సముద్రానికి తూర్పున 18 - 12 సెప్టెంబర్ మధ్య కాలంలో కదిలే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులలో ఒమన్ సుల్తానేట్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని అంచనా. అరేబియా సముద్రం మధ్యలోనే ఇది కదిలే అవకాశాలు ఉన్నాయి.’’ అని వాతావరణ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







