రియాద్లో ఇద్దరు భద్రతా అధికారులతో పాటు ఐదుగురు అరెస్ట్
- September 16, 2023
రియాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై ఇద్దరు భద్రతా అధికారులను రియాద్లో అరెస్టు చేశారు. దేశంలో అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి మరియు భద్రతా దళాల సమగ్రతను నిలబెట్టడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. వారిచ్చిన సమాచారంతో 74.6 కిలోగ్రాముల హషీష్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో పాటు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు ఇథియోపియన్ జాతీయులను కూడా అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన భద్రతా అధికారులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. మాదకద్రవ్యాల వ్యాపారంలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







