మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని కోరుకుంటున్నా: మంత్రి కెటిఆర్
- September 20, 2023
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. మాదాపూర్లో ఇంటర్నేషనల్ టెక్పార్క్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా నేతలు చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లో భాగంగా నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను’’ అని కెటిఆర్ అన్నారు.
ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లైఫ్సైన్సెస్ హబ్గా మారుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చాలా అందమైన నగరమని.. ఇక్కడ టాలెంట్కు కొరత లేదని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని తెలిపారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







