బస్సు యాత్రకు సిద్ధమైన టీ కాంగ్రెస్
- September 21, 2023
హైదరాబాద్: టీ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్ధమైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తుంది. రీసెంట్ గా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి రేపిన కాంగ్రెస్..ఇప్పుడు బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. వచ్చే నెల మొదటి వారం నుంచే యాత్రను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ముందు జరుగుతున్న బస్సుయాత్రలో…పార్టీ కీలక నేతలంతా పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుయాత్రలో ఆరు గ్యారంటీ పథకాలను… ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు. అదే సమయంలో బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ మొదటి వారంలోనే యాత్ర మొదలు పెట్టి 10–12 రోజుల్లోనే…వీలయినన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. బస్సుయాత్ర రూట్మ్యాప్, షెడ్యూల్ను…రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







