హిమాచల్ లో లోయలో పడ్డ బస్సు; 10 మంది మృతి
- May 20, 2016
హిమాచల్ ప్రదేశ్ లో బస్సు లోయలోకి పడిన దుర్ఘటనలో కనీసం పదిమంది మరణించగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. శుక్రవారం చంబా జిల్లాలో క్రిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చౌహరా డ్యామ్ సమీపంలో అదుపు తప్పి 80 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. సాంఘ్ని నుంచి డల్హౌసీకి బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో చాలామంది స్థానికులేనని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







