మోడీ ఖతార్ పర్యటన ఖరారు

- May 20, 2016 , by Maagulf
మోడీ ఖతార్ పర్యటన ఖరారు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జూన్‌లో రెండు రోజుల పాటు ఖతార్‌లో పర్యటించనున్నారు. గల్ఫ్‌ దేశమైన ఖతార్‌తో సత్సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు జూన్‌ 4న ఆయన అక్కడికి వెళుతున్నారు.
ఈ సందర్భంగా ఖతార్‌ ఎమిర్‌... షేక్‌ తామిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. పలు ఆర్థిక ఒప్పందాలు, హైడ్రోకార్బన్‌ సెక్టార్‌లో ఒప్పందాలపై దృష్టి సారిస్తారు. వాణిజ్య రంగంలో ఖతార్‌.. భారత్‌కు ప్రధాన భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఆ దేశంతో 15 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలతో సత్సంబంధాల్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ ఇప్పటికే యూఏఈలో పర్యటించారు. మే 22, 23 తేదీల్లో ఇరాన్‌లోనూ పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com