మోడీ ఖతార్ పర్యటన ఖరారు
- May 20, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జూన్లో రెండు రోజుల పాటు ఖతార్లో పర్యటించనున్నారు. గల్ఫ్ దేశమైన ఖతార్తో సత్సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు జూన్ 4న ఆయన అక్కడికి వెళుతున్నారు.
ఈ సందర్భంగా ఖతార్ ఎమిర్... షేక్ తామిమ్ బిన్ హమద్ అల్ థానీతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. పలు ఆర్థిక ఒప్పందాలు, హైడ్రోకార్బన్ సెక్టార్లో ఒప్పందాలపై దృష్టి సారిస్తారు. వాణిజ్య రంగంలో ఖతార్.. భారత్కు ప్రధాన భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఆ దేశంతో 15 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో సత్సంబంధాల్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ ఇప్పటికే యూఏఈలో పర్యటించారు. మే 22, 23 తేదీల్లో ఇరాన్లోనూ పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







