హిమాచల్ లో లోయలో పడ్డ బస్సు; 10 మంది మృతి

- May 20, 2016 , by Maagulf
హిమాచల్ లో లోయలో పడ్డ బస్సు; 10 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లో బస్సు లోయలోకి పడిన దుర్ఘటనలో కనీసం పదిమంది మరణించగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. శుక్రవారం చంబా జిల్లాలో క్రిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చౌహరా డ్యామ్ సమీపంలో అదుపు తప్పి 80 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. సాంఘ్ని నుంచి డల్హౌసీకి బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో చాలామంది స్థానికులేనని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com