తొలిరోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ..
- September 23, 2023
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తొలిరోజు చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు విచారణ తొలిరోజు ముగిసింది. మార్నింగ్ సెషన్ లో 3 గంటల పాటు సీఐడీ అధికారుల విచారించారు. ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేయడం ప్రారంభించారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున గ్యాప్ ఇచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఇచ్చిన అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సీఐడీ విచారణ కొనసాగింది. ఏడు గంటలపాటు మొదటిరోజు చంద్రబాబును ప్రశ్నించారు. రెండు రోజులపాటు సాగే విచారణలో 14 గంటలపాటు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తో మీటింగ్ లపై కూడా చంద్రబాబును ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









