తొలిరోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ..
- September 23, 2023
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తొలిరోజు చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు విచారణ తొలిరోజు ముగిసింది. మార్నింగ్ సెషన్ లో 3 గంటల పాటు సీఐడీ అధికారుల విచారించారు. ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేయడం ప్రారంభించారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున గ్యాప్ ఇచ్చారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఇచ్చిన అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సీఐడీ విచారణ కొనసాగింది. ఏడు గంటలపాటు మొదటిరోజు చంద్రబాబును ప్రశ్నించారు. రెండు రోజులపాటు సాగే విచారణలో 14 గంటలపాటు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తో మీటింగ్ లపై కూడా చంద్రబాబును ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం







