దుబాయ్ లో అగ్ని ప్రమాదం..తప్పిన పెనుముప్పు
- September 25, 2023
దుబాయ్: సోమవారం తెల్లవారుజామున దుబాయ్లోని ఒక రెసిడెన్షియల్ టవర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. తెల్లవారుజామున 4 గంటల తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారులు సకాలంలో స్పందించడంతో ఎవరూ గాయపడలేదు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రకారం.. అల్ బార్షా స్టేషన్ నుండి అగ్నిమాపక సిబ్బంది ఆరు నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయించారు. మరో రెండు అగ్నిమాపక కేంద్రాల నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున 5.23 గంటలకు మంటలు అదుపులోకి రాగా మరోగంట తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం శీతలీకరణ చర్యలు కొనసాగుతున్నాయని, ఆ తర్వాత స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగిస్తామని అగ్నిమాపక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







