దుబాయ్ లో అగ్ని ప్రమాదం..తప్పిన పెనుముప్పు
- September 25, 2023
దుబాయ్: సోమవారం తెల్లవారుజామున దుబాయ్లోని ఒక రెసిడెన్షియల్ టవర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. తెల్లవారుజామున 4 గంటల తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారులు సకాలంలో స్పందించడంతో ఎవరూ గాయపడలేదు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రకారం.. అల్ బార్షా స్టేషన్ నుండి అగ్నిమాపక సిబ్బంది ఆరు నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయించారు. మరో రెండు అగ్నిమాపక కేంద్రాల నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున 5.23 గంటలకు మంటలు అదుపులోకి రాగా మరోగంట తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం శీతలీకరణ చర్యలు కొనసాగుతున్నాయని, ఆ తర్వాత స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగిస్తామని అగ్నిమాపక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







