షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్ మరణం పట్ల షేక్ మహమ్మద్ సంతాపం
- September 25, 2023
యూఏఈ: ఆదివారం మరణించిన షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్కు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నివాళులర్పించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్ )లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ మరణించినందుకు సంతాపం తెలిపారు. అతనిని 'విశ్వసనీయ సలహాదారు'గా గుర్తు చేసుకున్నారు. "ఈ రోజు, దుబాయ్ దాని విశిష్ట వ్యక్తులలో ఒకరైన షేక్ ముహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్కు వీడ్కోలు పలుకుతుంది. ఆయన నమ్మకమైన సలహాదారులు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి." అరి రాసుకొచ్చారు. షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్ దివంగత దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ సమకాలీనుడు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









