ఉమ్రా ట్రిప్తో బస్ డ్రైవర్స్కి ఆర్టీఏ 'బహుమతి'
- May 20, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, ఉమ్రా ట్రిప్ని 15 మంది పబ్లిక్ బస్ డ్రైవర్స్కి బహుమతిగా ఇచ్చింది. వారిలో ఆనందోత్సాహాల్ని నింపింది. ఆర్టిఎలోని ఓ సెగ్మెంట్కి ప్రత్యేక గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్ అలీ వెల్లడించారు. ఎంపిక చేయబడిన డ్రైవర్లుకి ఏజెన్సీ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరీ ఉమ్రాకి పంపారు. అలాగే, వారికి మంచి హోటల్లో అకామడేషన్, ట్రాన్స్పోర్టేషన్ వంటివి ఏర్పాటు చేశామని అలి చెప్పారు. ఉమ్రా గతంలో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా నిర్వహించినవారికి, ఐదేళ్ళ నుంచి వారి కెరీర్ కండక్ట్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టారు. హోలీ సైట్స్ నుంచి తిరిగి వచ్చిన డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ మరియు ఎంప్లాయీస్, డ్రైవర్ల మధ్య సంబంధాలు ఇంకా బలోపేతమయ్యేందుకు ఇలాంటివి ఉపయోగపడ్తాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







