ఉమ్రా ట్రిప్తో బస్ డ్రైవర్స్కి ఆర్టీఏ 'బహుమతి'
- May 20, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, ఉమ్రా ట్రిప్ని 15 మంది పబ్లిక్ బస్ డ్రైవర్స్కి బహుమతిగా ఇచ్చింది. వారిలో ఆనందోత్సాహాల్ని నింపింది. ఆర్టిఎలోని ఓ సెగ్మెంట్కి ప్రత్యేక గౌరవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్ అలీ వెల్లడించారు. ఎంపిక చేయబడిన డ్రైవర్లుకి ఏజెన్సీ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరీ ఉమ్రాకి పంపారు. అలాగే, వారికి మంచి హోటల్లో అకామడేషన్, ట్రాన్స్పోర్టేషన్ వంటివి ఏర్పాటు చేశామని అలి చెప్పారు. ఉమ్రా గతంలో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా నిర్వహించినవారికి, ఐదేళ్ళ నుంచి వారి కెరీర్ కండక్ట్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టారు. హోలీ సైట్స్ నుంచి తిరిగి వచ్చిన డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ మరియు ఎంప్లాయీస్, డ్రైవర్ల మధ్య సంబంధాలు ఇంకా బలోపేతమయ్యేందుకు ఇలాంటివి ఉపయోగపడ్తాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









