రష్మిక మండన్నా ‘యానిమల్’.! కొత్తగా సరికొత్తగా.!
- September 27, 2023
రష్మిక మండన్నా ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని హిందీలో తెరకెక్కించి అక్కడా సూపర్ సెన్సేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత బాలీవుడ్లోనే సెటిలైపోయాడు సందీప్ రెడ్డి. ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రమే ‘యానిమల్’. రణ్వీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సినిమాలోని క్యారెక్టర్లను ఒక్కొక్కరుగా పరిచయం చేస్తున్నారు ‘యానిమల్’ టీమ్.
ఈ పరిచయం ఒకింత ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తోంది. ‘యానిమల్’ అసలు సోల్ ఏంటీ.? ఏ కాన్సెప్ట్తో రూపొందుతోంది.. అనే అంశంపై అంతకంతకూ ఆసక్తి రేకెత్తుతోంది.
ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మండన్నా క్యారెక్టర్ చాలా కొత్తగా వుండబోతోందట. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో నిండైన చీరకట్టులో ట్రెడిషనల్గా కనిపిస్తోంది రష్మిక మండన్నా.
ఇంతవరకూ బాలీవుడ్లో రష్మిక చేసిన సినిమాలు ఓ ఎత్తు.. ఈ సినిమా ఇంకో ఎత్తు అనేలా వుండబోతోందట. ఈ సినిమా హిట్ అయితే, రష్మిక బాలీవుడ్లోనూ స్టార్డమ్ సంపాదించుకోవడం పక్కా అంటున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







