రష్మిక మండన్నా ‘యానిమల్’.! కొత్తగా సరికొత్తగా.!
- September 27, 2023
రష్మిక మండన్నా ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని హిందీలో తెరకెక్కించి అక్కడా సూపర్ సెన్సేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత బాలీవుడ్లోనే సెటిలైపోయాడు సందీప్ రెడ్డి. ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రమే ‘యానిమల్’. రణ్వీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సినిమాలోని క్యారెక్టర్లను ఒక్కొక్కరుగా పరిచయం చేస్తున్నారు ‘యానిమల్’ టీమ్.
ఈ పరిచయం ఒకింత ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తోంది. ‘యానిమల్’ అసలు సోల్ ఏంటీ.? ఏ కాన్సెప్ట్తో రూపొందుతోంది.. అనే అంశంపై అంతకంతకూ ఆసక్తి రేకెత్తుతోంది.
ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మండన్నా క్యారెక్టర్ చాలా కొత్తగా వుండబోతోందట. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో నిండైన చీరకట్టులో ట్రెడిషనల్గా కనిపిస్తోంది రష్మిక మండన్నా.
ఇంతవరకూ బాలీవుడ్లో రష్మిక చేసిన సినిమాలు ఓ ఎత్తు.. ఈ సినిమా ఇంకో ఎత్తు అనేలా వుండబోతోందట. ఈ సినిమా హిట్ అయితే, రష్మిక బాలీవుడ్లోనూ స్టార్డమ్ సంపాదించుకోవడం పక్కా అంటున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







