గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి

- September 28, 2023 , by Maagulf
గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి

హైదరాబాద్‌: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. కాసేపటి క్రితమే..ఖైర తాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. అధికారుల సమక్షంలో ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు . హుసేన్‌ సాగర్‌ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్‌ నంబర్‌ 4 దగ్గర ఖైరతాబాద్‌ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ తరుణంలో… అక్కడ ఉన్న భక్తులు బైబై గణేష్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్‌ గణేషుని నిమజ్జనం చూసేందుకు ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారు.

ముందుగా అధికారులు చెప్పినట్లుగానే మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి చేశారని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com