గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి
- September 28, 2023
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. కాసేపటి క్రితమే..ఖైర తాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. అధికారుల సమక్షంలో ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు . హుసేన్ సాగర్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ తరుణంలో… అక్కడ ఉన్న భక్తులు బైబై గణేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చూసేందుకు ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారు.
ముందుగా అధికారులు చెప్పినట్లుగానే మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి చేశారని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది.
తాజా వార్తలు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు







