సౌదీ అరేబియాలో తొలి లూసిడ్ కార్ల ఫ్యాక్టరీ ప్రారంభం
- September 28, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో మొట్టమొదటి కార్ల తయారీ కేంద్రాన్ని లూసిడ్ గ్రూప్ బుధవారం అధికారికంగా ప్రారంభించింది. సౌదీ మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ ముఖ్యఅతిథిగా పాల్గొని తయారీ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియా విజన్ 2030కి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ పరిశ్రమ, సరఫరా గొలుసు విస్తరణ మరియు సాంకేతిక రంగంలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. అనంతరం లూసిడ్ CEO పీటర్ రాలిన్సన్ మాట్లాడుతూ.. ఇది లూసిడ్ రెండవ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని (AMP-2), సౌదీ మార్కెట్ లో అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను దీనిలో తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు మరింత సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కారును అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







