ఐదుగురిని రక్షించిన సోదరీమణులను సత్కరించిన పోలీసులు
- September 29, 2023
దుబాయ్: ఇద్దరు ఎమిరాటీ సోదరీమణులు అమ్నా మరియు మైతా ముఫ్తాహ్ ముహమ్మద్, రస్ అల్ ఖైమాలోని ఔటర్ రోడ్లో ఓ కారు ప్రమాదానికి గురైనప్పడు అందులోని ఆసియాకు చెందిన ఐదుగురు కుటుంబసభ్యులను రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులోని కుటుంబసభ్యులను ఈ సోదరీమణులు ధైర్యంగా వారి వాహనం నుండి బయటకు లాగారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్ మరియు రెస్క్యూ బృందాలు వచ్చే వరకు ఇద్దరూ వారికి ప్రథమ చికిత్స అందించారు. వారి ధైర్య సహసాలను గమనించిన రాస్ ఖైమా పోలీసులు, కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ పోలీస్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్-నుయిమి ఆదేశాల మేరకు బుధవారం (సెప్టెంబర్ 25) ఇద్దరు సోదరీమణులను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుండి తిరిగి వస్తుండగా బాధితుల కారు ప్రమాదానికి గురై కనిపించిందని, వెంటేనే తాము ఆలస్యం చేయకుండా వారికి సహాయం అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







