ఐదుగురిని రక్షించిన సోదరీమణులను సత్కరించిన పోలీసులు
- September 29, 2023
దుబాయ్: ఇద్దరు ఎమిరాటీ సోదరీమణులు అమ్నా మరియు మైతా ముఫ్తాహ్ ముహమ్మద్, రస్ అల్ ఖైమాలోని ఔటర్ రోడ్లో ఓ కారు ప్రమాదానికి గురైనప్పడు అందులోని ఆసియాకు చెందిన ఐదుగురు కుటుంబసభ్యులను రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులోని కుటుంబసభ్యులను ఈ సోదరీమణులు ధైర్యంగా వారి వాహనం నుండి బయటకు లాగారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్ మరియు రెస్క్యూ బృందాలు వచ్చే వరకు ఇద్దరూ వారికి ప్రథమ చికిత్స అందించారు. వారి ధైర్య సహసాలను గమనించిన రాస్ ఖైమా పోలీసులు, కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ పోలీస్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్-నుయిమి ఆదేశాల మేరకు బుధవారం (సెప్టెంబర్ 25) ఇద్దరు సోదరీమణులను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుండి తిరిగి వస్తుండగా బాధితుల కారు ప్రమాదానికి గురై కనిపించిందని, వెంటేనే తాము ఆలస్యం చేయకుండా వారికి సహాయం అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







