ఐదుగురిని రక్షించిన సోదరీమణులను సత్కరించిన పోలీసులు
- September 29, 2023
దుబాయ్: ఇద్దరు ఎమిరాటీ సోదరీమణులు అమ్నా మరియు మైతా ముఫ్తాహ్ ముహమ్మద్, రస్ అల్ ఖైమాలోని ఔటర్ రోడ్లో ఓ కారు ప్రమాదానికి గురైనప్పడు అందులోని ఆసియాకు చెందిన ఐదుగురు కుటుంబసభ్యులను రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులోని కుటుంబసభ్యులను ఈ సోదరీమణులు ధైర్యంగా వారి వాహనం నుండి బయటకు లాగారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్ మరియు రెస్క్యూ బృందాలు వచ్చే వరకు ఇద్దరూ వారికి ప్రథమ చికిత్స అందించారు. వారి ధైర్య సహసాలను గమనించిన రాస్ ఖైమా పోలీసులు, కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ పోలీస్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్-నుయిమి ఆదేశాల మేరకు బుధవారం (సెప్టెంబర్ 25) ఇద్దరు సోదరీమణులను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుండి తిరిగి వస్తుండగా బాధితుల కారు ప్రమాదానికి గురై కనిపించిందని, వెంటేనే తాము ఆలస్యం చేయకుండా వారికి సహాయం అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









