మస్కట్ -తిరువనంతపురం మధ్య ఒమన్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్
- September 29, 2023
మస్కట్: ఒమన్ ఎయిర్ త్వరలో మస్కట్ నుండి దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ రాజధాని తిరువనంతపురంకు నేరుగా విమాన సర్వీసుని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుండి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మస్కట్తో కలుపుతున్నట్లు ఒమన్ అధికారికంగా ప్రకటించింది.రెండు నగరాల మధ్య 162 మంది సామర్థ్యంతో బోయింగ్ 737 విమానాన్ని నడుపనున్నారు. ఆది, బుధ, గురు, శనివారాల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆది, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు వచ్చి 8.45 గంటలకు బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.55 కు వచ్చి సాయంత్రం 4.10గంటలకు బయలుదేరుతుంది. శనివారాల్లో ఈ విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చేరి 3.30 గంటలకు బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు







