మస్కట్ -తిరువనంతపురం మధ్య ఒమన్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్
- September 29, 2023
మస్కట్: ఒమన్ ఎయిర్ త్వరలో మస్కట్ నుండి దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ రాజధాని తిరువనంతపురంకు నేరుగా విమాన సర్వీసుని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుండి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మస్కట్తో కలుపుతున్నట్లు ఒమన్ అధికారికంగా ప్రకటించింది.రెండు నగరాల మధ్య 162 మంది సామర్థ్యంతో బోయింగ్ 737 విమానాన్ని నడుపనున్నారు. ఆది, బుధ, గురు, శనివారాల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆది, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు వచ్చి 8.45 గంటలకు బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.55 కు వచ్చి సాయంత్రం 4.10గంటలకు బయలుదేరుతుంది. శనివారాల్లో ఈ విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చేరి 3.30 గంటలకు బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







