మస్కట్ -తిరువనంతపురం మధ్య ఒమన్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్
- September 29, 2023
మస్కట్: ఒమన్ ఎయిర్ త్వరలో మస్కట్ నుండి దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ రాజధాని తిరువనంతపురంకు నేరుగా విమాన సర్వీసుని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుండి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మస్కట్తో కలుపుతున్నట్లు ఒమన్ అధికారికంగా ప్రకటించింది.రెండు నగరాల మధ్య 162 మంది సామర్థ్యంతో బోయింగ్ 737 విమానాన్ని నడుపనున్నారు. ఆది, బుధ, గురు, శనివారాల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆది, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు వచ్చి 8.45 గంటలకు బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.55 కు వచ్చి సాయంత్రం 4.10గంటలకు బయలుదేరుతుంది. శనివారాల్లో ఈ విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చేరి 3.30 గంటలకు బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









