మస్కట్ -తిరువనంతపురం మధ్య ఒమన్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

- September 29, 2023 , by Maagulf
మస్కట్ -తిరువనంతపురం మధ్య ఒమన్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

మస్కట్: ఒమన్ ఎయిర్ త్వరలో మస్కట్ నుండి దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ రాజధాని తిరువనంతపురంకు నేరుగా విమాన సర్వీసుని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుండి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మస్కట్‌తో కలుపుతున్నట్లు ఒమన్ అధికారికంగా ప్రకటించింది.రెండు నగరాల మధ్య 162 మంది సామర్థ్యంతో బోయింగ్ 737 విమానాన్ని నడుపనున్నారు. ఆది, బుధ, గురు, శనివారాల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆది, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు వచ్చి 8.45 గంటలకు బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.55 కు వచ్చి సాయంత్రం 4.10గంటలకు బయలుదేరుతుంది. శనివారాల్లో ఈ విమానం తిరువనంతపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చేరి 3.30 గంటలకు బయలుదేరుతుందని విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com