జాతీయ క్రీడా పోటీల్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సత్తా
- September 30, 2023
హైదరాబాద్: గుజరాత్ లోని బరోడాలో ఇటీవల జరిగిన 2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఉద్యోగులు రెండు పతకాలను సాధించారు.
బాడ్మింటన్ విమెన్స్ డబుల్ కేటగిరిలో రన్నర్ అప్స్ గా టీఎస్ఆర్టీసీకి చెందిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి నిలిచారు. వారు సిల్వర్ మెడల్ సాధించారు. బాడ్మింటన్ విమెన్స్ టీం చాంపియన్ కేటగిరిలో టీఎస్ఆర్టీసీ రన్నర్ ఆప్స్ గా నిలిచింది. ఈ కేటగిరిలో ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలు సిల్వర్ మెడల్ గెలుపొందారు.
2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హర్షం వ్యక్తం చేశారు.
పతకాలు సాధించిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలను బస్ భవన్లోని తన ఛాంబర్లో శనివారం ఆయన అభినందించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. క్రీడల్లో ఆసక్తిగా ఉన్న ఉద్యోగులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇ.డి (ఎ,ఎం, పి అండ్ ఎ.ఎం) కృష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, కోచ్ ఏవీవీ రామరాజు, మేనేజర్ ఎండీ అన్సర్ అలీ, ఫిజియో హిమన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







