జాతీయ క్రీడా పోటీల్లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సత్తా
- September 30, 2023
హైదరాబాద్: గుజరాత్ లోని బరోడాలో ఇటీవల జరిగిన 2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఉద్యోగులు రెండు పతకాలను సాధించారు.
బాడ్మింటన్ విమెన్స్ డబుల్ కేటగిరిలో రన్నర్ అప్స్ గా టీఎస్ఆర్టీసీకి చెందిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి నిలిచారు. వారు సిల్వర్ మెడల్ సాధించారు. బాడ్మింటన్ విమెన్స్ టీం చాంపియన్ కేటగిరిలో టీఎస్ఆర్టీసీ రన్నర్ ఆప్స్ గా నిలిచింది. ఈ కేటగిరిలో ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలు సిల్వర్ మెడల్ గెలుపొందారు.
2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హర్షం వ్యక్తం చేశారు.
పతకాలు సాధించిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలను బస్ భవన్లోని తన ఛాంబర్లో శనివారం ఆయన అభినందించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. క్రీడల్లో ఆసక్తిగా ఉన్న ఉద్యోగులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇ.డి (ఎ,ఎం, పి అండ్ ఎ.ఎం) కృష్ణకాంత్, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, కోచ్ ఏవీవీ రామరాజు, మేనేజర్ ఎండీ అన్సర్ అలీ, ఫిజియో హిమన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









