గూగుల్ మ్యాప్ ఆధారం డ్రైవింగ్ ..ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు డాక్టర్లు మృతి
- October 02, 2023
తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో గత రాత్రి ఘోరం ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్తున్న ఓ కారు పెరియార్ నదిలోకి వెళ్లింది. దీంతో కారు నీట మునిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
మృతులను డాక్టర్ అద్వైత్(29), అజ్మల్(29) గా గుర్తించారు. వీరిద్దరూ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని స్థానికులు రక్షించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారికి రహదారి సరిగా కనిపించకపోవడం, గూగుల్ మ్యాప్ పక్కదోవ పట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని గూగుల్ మ్యాప్ సూచించడంతో.. కారు అటుగా వెళ్లడంతో నదిలో మునిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కారు నీట మునిగి ప్రమాదానికి గురైందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









