భారత్లో 5జి పై మోజు
- October 03, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి భారత్లో 5జి వినియోగదారులు 3.1 కోట్లకు చేరొచ్చని ఎరిక్సన్ సర్వేలో వెల్లడయ్యింది. 5జికి డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు రెండు గంటలు ఎక్కువగా 5జి సర్వీస్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఎరిక్సన్ సర్వే ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 లక్షల నుంచి కోటి మంది 5జి వినియోగదారులున్నారని అంచనా వేసింది. ఎక్కువ మంది 5జి డేటాను హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్, మొబైల్ గేమ్లు ఆడేందుకు ఉపయోగిస్తున్నారు. 15 శాతం మంది యాప్ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మ్యూజిక్ వంటి సర్వీస్లతో కూడిన 5జి డేటా ప్లాన్లకు ప్రస్తుత ధర కంటే 14 శాతం ఎక్కువ చెల్లించడానికి సిద్దంగా ఉన్నారు. భారత్లో గతేడాది అక్టోబర్లో పలు ప్రయివేటు టెల్కోలు 5జి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







